కరెంట్ బిల్లు తగ్గాలి అంటే.. ఏసీని తప్పకుండా ఇలానే వాడాలంట!
samatha
2 MAY 2025
Credit: Instagram
గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎండవేడి విపరీతంగా ఉంది. దీంతో చాలా మంది ఏసీని కొనుగోలు చేసి వాడేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.
అయితే కొంత మంది ఏసీ ఎక్కువవాటం వలన అధిక కరెంట్ బిల్లు వస్తుందని భయపడి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు.
అయితే సమ్మర్లో ఏసీ ఎంత వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఏసీ వాడినంత సేపు కిటికీలు,తలుపులు ఎల్లప్పుడూ మూసివేయాలి. దీని వలన చల్లటి గాలి బయటకు పోదు. ఏసీ ఆఫ్ చేసినా చల్లగా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా ఆదా అవుద్దీ.
ఏసీ వాడినా కరెంట్ బిల్లు తక్కువ రావడానికి, మీ AC ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడమే కాకుండా క్రమం తప్పకుండా సర్వీసింగ్ షెడ్యూల్ చేయయాలంట.
ఏసీని తక్కువ ఉష్ణోగ్రతకు సెట్ చేయడం వల్ల గది వేగంగా చల్లబడుతుందనుకుంటారు కానీ అది ఓ అపోహ మాత్రమే అంటున్నారు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ వారు.
మీరు మీ ఏసీని 24 డిగ్రీల సెల్సియస్కు సెట్ చేస్తే కరెంట్ బిల్లు ఆదా అవుతుందంట. మీరు ఉష్ణోగ్రతను తగ్గించే ప్రతి డిగ్రీకి మీ విద్యుత్ వినియోగం ఆరు శాతం పెరుగుతుందంట.
కాబట్టి మీ బిల్లులను ఆదా చేయడానికి, ACని 16 డిగ్రీలకు సెట్ చేయడం చాలా ఉత్తమం. అలాగేమీ గదిని AC-ఆధారిత సిమ్లాగా మార్చే అలవాటును తగ్గించుకోండి.20-24 డిగ్రీల పరిధిని కూడా సూచించాలంట.