డయాబెటీస్‌ కంట్రోల్‌ అవ్వాలా.. తప్పక తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే

03  october 2025

Samatha

ప్రస్తుతం చాలా మంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు కొన్ని రకాల ఫుడ్ తీసుకోవడం చాలా మంచిదంట.

కొన్ని రకాల ఆహార పదార్థాలు మధుమేహ సమస్యను తగ్గిస్తాయంట. మరి ఏ ఆహార పదార్థాలు డయాబెటీస్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయో చూద్దాం.

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లలో బెర్రీస్ ఒకటి.  వీటిని ఎక్కువగా తినడం వలన బ్లడ్ షుగర్ తగ్గుతుంది.

ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన మెంతి, పాలక కూర వంటివి తీసుకోవడం వలన కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుందంట.

కందులు, శనగలు, పెసర్లలో కూడా మంచి ఫైబర్, గ్లైసెమిక్స్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటీస్ నుంచి కాపాడుతుంది

ఆక్రోట్స్, పిస్తా, బాదం, ప్రతి రోజూ తినడం వలన ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, రక్తంలో షుగర్ పెరగకుండా సహాయపడతాయి.

అలాగే సహజంగా లభించే పండ్లు , ఆకు కూరలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయంట.

అందుకే ప్రతి రోజూ మంచి పోషకాలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆరోగ్యా నిపుణులు సూచిస్తున్నారు.