కిడ్నీలో రాళ్లకు చెక్ పెట్టాలా.. తప్పకుండా ఇలా చేయండి మరి!
samatha
14 JUN 2025
Credit: Instagram
ఈ రోజుల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ల సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది.
మూత్రపిండాల్లో రాళ్లు ఉండటంతో కడుపు, నడుమునొప్పి వంటి అనేక ఇబ్బందులు వస్తాయి. దీంతో ఏ పని సరిగా చేయలేరు. ఆరోగ్యం క్షీణిస్తుంటుంది.
అందువలన కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
ప్రతి రోజూ ఉదయం గ్లాస్ నీరు తప్పకుండా తాగాలంట. దీని వలన యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉండటమే కాకుండా మన శరీరం హైడ్రేట్ అవుతుంది. రోజూ ఇలా చేయడం వలన కిడ్నీల్లోకి రాళ్లు రావు అంటున్నారు వైద్యులు.
నిమ్మకాయ రసం గోరువెచ్చటి నీటిలో కలుపుకొని, దానిలో కాస్త ఉప్పు వేసి కలిపి, ఉదయం లేచినవెంటనే తాగాలి. ఇలా చేయడం వలన యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఉదయం కాఫీ తాగడం వలన కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయంట. దీని వలన యూరిక్ యాసిడ్ నియంత్రించడటమే కాకుండా ఇది ప్యూరిన్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్ లతో పోటిపడుతుందంట.యూరిక్ యాసిడ్ విర్జన రేటు పెంచుతుందంట.
రోజూ ఉదయం మార్నింగ్ వాక్లో కనీసం గంటసేపైనా చెప్పులు లేకుండా నేల, గడ్డిపై నడవడం వలన మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు సమతుల్యం చేయవచ్చు
కొందరు ఉదయం ఆల్కహాల్, సోడావంటి పానీయాలు తీసుకుంటారు. అయితే ఇలాంటి కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడం వలన యూరిక్ యాసిడ్ స్థాయిలపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందంట.