భోజనం చేస్తూ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

Samatha

28 october 2025

అన్నం తింటూ నీళ్లు తాగడం అనేది కామన్. ప్రతి ఒక్కరూ అన్నం తింటూ మంచినీరు తాగుతుంటారు.

 అయితే చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే? అసలు అన్నం తింటూ నీళ్లు తాగొచ్చా? దీని వలన ఏవైనా సమస్యలు వస్తాయా అని.

 కొందరు అన్నం తింటూ నీళ్లు తాగడం ద్వారా తీసుకేనే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది, మలబద్ధకం సమస్య రాదు అని చాలా మంది అనుకుంటారు.

కానీ అన్నం తింటూ నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అంటున్నారు ఆయుర్వేద శాస్త్ర నిపుణులు.

ఆహారంతో పాటు నీరు తీసుకోవడం వలన జీర్ణ రసాలు తగ్గిపోయి, జీర్ణ శక్తి తగ్గుతుందంట. దీని వలన జీర్ణ కోశ , అసిడిటీ  వంటి సమస్యలు వస్తాయి.

అలాగే, కొందరు అన్నం లేదే ఏదైనా ఆహారం తింటున్నప్పుడు నీరు తాగడం వలన కడుపునొప్పి లాంటి సమ్యలు ఎదురు అవుతాయంట.

అందు వలన మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం కావాలి అంటే, మనం అన్నం తినడానికి 30 నిమిషాల ముందు వాటర్ తాగాలంట.

లేదా ఆహారం తీసుకున్న గంట తర్వాత మంచినీరు తాగడం వలన జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపదు అంటున్నారు నిపుణులు.