వామ్మో ఇలాంటి మామిడిపండ్లు తింటున్నారా.. ఆరోగ్యానికి ముప్పు తప్పదు!

samatha 

10 MAY 2025

Credit: Instagram

మామిడి పండ్లు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే ధర గురించి ఆలోచించకుండా ఎక్కువ మామిడిపండ్లు కొనుగోలు చేసి తింటుంటారు.

అయితే ఇప్పుడున్న మార్కెట్లలో మంచి మామిడిపండ్లు అనేవి దొరకడం లేదు. చాలా వరకు రసాయనాలు చల్లినవే మార్కెట్‌లో అందుబాటులో ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు.

అయితే కాల్షియం, కార్బైడ్ వంటి హానికర రసాయనాలు వాడిన మామిడిపండ్లు తింటే ఆరోగ్యానికి పెను ముప్పు తప్పదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అలాంటివి కొనుగోలు చేయకూడదంట.

రసాయనాలు, ఆర్సెనిక్, ఫాస్పరస్‌లు వాడిన మామిడిపండ్లు తినడం వలన చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్య నిపుణులు.

అందుకే కొనుగోలు చేసే సమయంలో నిగ నిగ ఉన్నాయి కదా అని కొనుగోలు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచనలు జారీ చేస్తున్నారు.

వరిగడ్డి తదితర సహజ పద్ధతిలో పండించిన మామిడిపండ్లతో ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు అని రసాయనాలు ఆర్సెనిక్, ఫాస్పరస్‌లు వాడినవి తింటేనే చాలా ప్రమాదకరం అంట.

అలాంటి వాటితో చర్మ వ్యాధులు, గొంతు సమస్యలు, దగ్గు, అలెర్జీ , కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయిని తెలుపుతున్నారు వైద్యులు.

అలాగే కార్బైడ్  వినియోగించి మాగపెట్టిన పండ్లపై నల్లటి మచ్చలు ఉంటాయని, వాటిని గుర్తుపట్టి వాటిని కొనుగోలు చేయకపోవడమే మేలు అంటున్నారు నిపుణులు