మిస్ వరల్డ్ పోటీల్లో రైతు బిడ్డ.. ఈ అమ్మడు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవే!

samatha 

10 MAY 2025

Credit: Instagram

అందాల పోటీలకు భాగ్యనగరం ముస్తాబు అయ్యింది. ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు.

అందాల పోటీలకు భాగ్యనగరం ముస్తాబు అయ్యింది. ప్రపంచంలోని వివిధ దేశాల సుందరీమణులు ఈ పోటీలో పాల్గొననున్నారు.

ఈ క్రమంలోనే అందాల పోటీల్లో పాల్గొన బోయే రైతు బిడ్డకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అవి ఏవిఅంటే?

మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భారత్ తరఫున నందినీ గుప్తా అనే అమ్మాయి పాల్గొనబోతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం ఈమె అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ బ్యూటీ2003 సెప్టెంబర్‌లో రాజస్థాన్ రాష్ట్రం కోటాలో  ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించింది.

ఈ ముద్దుగుమ్మ తల్లి గృహిణి కాగా, తండ్రి వ్యవసాయదారుడు. నందనీ గుప్తాకు ఒక చెల్లె కూడా ఉంది. ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

నందినీ గుప్తా మాట్లాడుతూ.. నా బాల్యం మొత్తం శనగలు, సజ్జలు, పంట పొలాల్లోనే గడిచిందంటూ చెప్పుకొచ్చింది.

ఇక సెయింట్ పాల్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో చదివిన ఆమె, ముంబైలోని లాలా లజపతి రాయ్ కాలేజీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ పూర్తి చేశారు.

తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టారు.2023లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది.2025లో ఈమె విజయాన్ని అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.