కళ్లలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. చూపు పోయే ప్రమాదాన్ని ముందే గుర్తించండి!
23 August 2026
Rajashekher
అప్పుడప్పుడు స్క్రీన్ వల్ల చూపు మసకబారడం సాధారణమే. కానీ తరచూ ఇలా జరుగుతుంటే కంటి పవర్లో మార్పులు, కంటిశుక్లం లేదా మధుమేహం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిల మార్పులు ఉండవచ్చు.
తరచూ చూపు మసకబారడం:
చదవడం లేదా కంప్యూటర్ ఉపయోగించే సమయంలో తరచూ కంటి అలసట, నొప్పి లేదా తలనొప్పి వస్తే చూపు సమస్యలు, డ్రై ఐ, ఇన్ఫెక్షన్ లేదా కంటి వాపు వంటి కారణాలు ఉండవచ్చు.
కంటి ఒత్తిడి, తలనొప్పి:
కళ్లలో తరచూ ఎర్రదనం, మంట, నీరు రావడం డ్రై ఐ, అలర్జీ, ఇన్ఫెక్షన్ లేదా వాపుకు సంకేతం కావచ్చు. సమస్య ఎక్కువకాలం ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు.
కళ్లలో ఎర్రదనం, మంట:
రాత్రి సమయంలో వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం లేదా లైట్ల నుంచి ఎక్కువ గ్లేర్ కనిపించడం ప్రారంభ కంటిశుక్లం లేదా రెటీనాలో మార్పులకు సంకేతం కావచ్చు.
రాత్రివేళ సరిగ్గా కనిపించకపోవడం:
సాధారణ కాంతి కూడా కళ్లకు ఇబ్బందిగా అనిపించడం లేదా వెలుతురును చూసినప్పుడు అసౌకర్యం కలగడం కొన్ని కంటి సమస్యలకు సూచన కావచ్చు.
వెలుతురును తట్టుకోలేకపోవడం:
చిన్న నల్లటి చుక్కలు లేదా దారాల్లాంటి ఆకారాలు కళ్ల ముందు తేలుతున్నట్లు కనిపించవచ్చు. అయితే అకస్మాత్తుగా వీటి సంఖ్య పెరిగితే కంటి వైద్యుడిని సంప్రదించాలి.
కళ్ల ముందు ఫ్లోటర్లు కనిపించడం:
కళ్ల ముందు అకస్మాత్తుగా ఫ్లాష్లా వెలుగులు కనిపించడం, ఫ్లోటర్లు పెరగడం లేదా చూపులో నీడ పడినట్లు అనిపించడం రెటీనా సమస్యకు సంకేతం కావచ్చు. ఇది అత్యవసర పరిస్థితి కావొచ్చు.
వెలుగులు మెరుస్తున్నట్లు కనిపించడం:
కంటి పరీక్షల ద్వారా గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి, అధిక రక్తపోటు ప్రభావం వంటి సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ప్రారంభ దశలో గుర్తిస్తే చూపు నష్టాన్ని నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.