నాన్ వెజ్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఆది వారం వచ్చిందంటే చాలు చికెన్, మటన్ తింటారు.
నాన్ వెజ్
అయితే ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. మరి ఈ వానాకాలంలో మాంసాహారం తినడం ఆరోగ్యానికి మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
వర్షాకాలం
వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు అనేవి అటాక్ చేస్తుంటాయి. కలుషితమైన నీరు, ఈగలు, దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి.
సీజనల్ వ్యాదులు
దీంతో అనేక రకాల రోగాలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలా మంది దగ్గు, మలేరియా, వంటి అనేక రకాల వ్యాధుల బారినపడుతుంటారు.
అనేక రోగాలు
మరి ఈ సమయంలో మటన్ తినడం మంచిదేనా అంటే? అస్సలే ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఆరోగ్య నిపుణులు
వర్షాకాలంలో అనేక రకాల అంటు వ్యాధులు స్వైర విహారం చేస్తుంటాయి. ముఖ్యంగా మసాంహారం అస్సలే తీసుకోకూడదంట, దీని వలన రోగాలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉన్నదంట.
రోగాల వ్యాప్తి
వానాకాలంలో వాతావరణం తేమగా ఉంటుంది, దీని వలన సూర్యకాంతి తక్కువగా ఉండటం వలన శిలింధ్రాలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్రమాదం పెరుగుతంది.
ఫంగస్, బ్యాక్టీరియా
ఆహారాలపై బ్యాక్టీరియా పేరుకుపోతుంది. కీటకాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో మాంసం తినడం వలన ఫుడ్ పాయిజన్, అంటు వ్యాధులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుందంట.