మహాకుంభమేళా తర్వాత నాగ సాధవులు ఎక్కడ అదృశ్యమవుతారో తెలుసా?
samatha.j
25 January 2025
Credit: Instagram
12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ మహా కుంభమేళాలో నాగ సాధువులు, అఘోరాలు స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంటారు.
ప్రస్తుతం మహాకుంభ మేళా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కుంభమేళలో నాగసాధువులు ప్రత్యేక్ష ఆకర్షణగా నిలిచారు, తర్వాత వీరు మాయమై పోతారు.
కాగా, అసలు దీని తర్వాత వారు ఎక్కడికి వెళ్తారు అనే విషయం గురించి మనం పూర్తి గా తెలుసుకుందాం. కుంభ మేళ తర్వాత నాగసాధువులు చల్లని ప్రదేశాల్లో నివసించడానికి వెళ్తారంట.
వారిని చేరుకోవడం దాదాపు ఎవరికీ సాధ్యం కాదు. ఇక నాగ సాధువు శరీరంలో శక్తి స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన వారు వేడి అస్సలే తట్టుకోలేరు.
దీని కారణంగానే నాగ సాధువులు చల్లని ప్రదేశాల్లో నివసిస్తారంటున్నారు ప్రముఖులు.మహా కుంభమేళ అనంతరం వారు హిమాలయాలకు, ఎత్తైన ప్రాంతాలకు వెళ్తారు.
ఇలా వెళ్లడానికి కూడా ముఖ్యకారణం చల్లదనమేనంట. అంతే కాకుండా వారు హిందూ మతానికి సంబంధించిన పెద్ద పండుగ ఉంటేనే హిమాలయాల నుంచి కిందకు వస్తారు.
లేకపోతే పర్వత గుహలలో నివసించి సాధన చేస్తారంట. అంతే కాకుండా వారు బట్టలు లేకుండా ఉన్నా వారికి చలి వేయదంట
ఎందుకంటే వారు మత్రాలను జపించిన తర్వాత వారి శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి భభూతిని ఒంటి నిండా పూసుకుంటారు