రాఖీ ఎప్పుడు కట్టాలి? శుభ సమయం తెలుసా?

Samatha

28 August 2026

రక్షాబంధన్ పండుగ వచ్చేసింది. ఆగస్టు 28 శుక్ర వారం రోజున ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

ఇక రాఖీ పౌర్ణమి అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతముళ్ల అనుబంధానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు చాలా డౌట్స్ ఉంటాయి.

ముఖ్యంగా రాఖీ కట్టడానికి శుభ సమయం ఏది అనే చర్చ కొనసాగుతుంటుంది. భద్రకాలం ఉందా అని అనుమానపడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

హిందూ పంచాంగం ప్రకారం ఈ సారి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 27, గురువారం ఉదయం 9 :8గంటలకు ప్రారంభమై, శుక్రవారం ఉదయం 9 :48 గంటలకు ముగుస్తుంది.

అందువలన ఆగస్టు 28 శుక్రవారం ఉదయమే రాఖీ కట్టడానికి చాలా శుభప్రదమైన రోజు అని చెబుతుంటారు పండితులు.  ఈరోజు కట్టడం చాలా మంచిదంట.

ఆగస్టు 28న ఉదయం 5:57 గంటల నుంచి 9:40 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయంగా చెప్పుకొస్తుంటారు. అందువలన ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం..

అంతే కాకుండా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఎప్పుడైనా రాఖీ కట్ట వచ్చు అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

నోట్ : పై సమాచారం నిపుణులు, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.