రేపే అక్షయతృతీయ.. బీరువాలో ఇదొక్కటి పెడితే ఇక డబ్బే డబ్బు!

samatha 

29 April 2025

Credit: Instagram

మహిళలందరికీ ఇష్టమైన అక్షయతృతీయ వచ్చేస్తుంది. ఈ పండుగను హిందువులందరూ చాలా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు.

ఇక 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 30, 2025న వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ రోజు వైశాఖ మాసంలోని శుక్ల పక్ష మూడవ రోజున వస్తుంది. 

అక్షయతృతీయకు చాలా పాముఖ్యత ఉంటుంది. ఈ రోజున ఏదైనా కొత్త పని, పెట్టుబడి, వ్యాపారం లేదా కొనుగోలును ఎటువంటి ప్రత్యేక ముహూర్తం లేకుండా చేయవచ్చు.

ఇక ఈరోజున చాలా మంది బంగార కొనుగోలు చేయడం లేదా దానధర్మాలు చేయడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం లాంటివి చేస్తుంటారు.

అయితే  ఈ అక్షయతృతీయ రోజున బీరువాలో లేదా ఇంట్లో శుభప్రదమైన ప్రదేశంలో అక్షయ పాత్రను పెట్టడం వలన మంచి ఫలితాలు కలుగుతాయంట.

అక్షయతృతీయ రోజున ధనలాభం కలిగి సంవత్సరం అంతా సిరిసంపదలతో తలతూగాలి అంటే తప్పకుండా ఈ రోజు ఈ పనులు చేయాలంట.

అక్షయతృతీయ రోజున ఒక మట్టి కుండను తీసుకొచ్చుకుని దానిని పసుపు కుంకుమ, పర్చకర్పూరా రోజ్ వాటర్ ఇలా వాటన్నింటితో కలిపి అక్షయ పాత్రను తయారు చేసుకోవాలి.

తర్వాత ఆ అక్షయపాత్రలో పసుపు,కుంకుమ, కర్పూరం బిళ్లలు వేసి అందులో గంగాజలం పోయాలి. దీనిని ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి అందులో 11 రూపాయలు పెట్టాలి.

తర్వాత అక్షయ పాత్రను బీరువాలో డబ్బులు పెట్టుకునే ప్లేస్‌లో పెట్టుకోవడం వలన ఇక మీ ఇంట సంపద పెరగడమే కాకుండా చేతినిండా డబ్బే డబ్బు ఉంటుందంట.