గత సంవత్సరం మట్టి దీపాల్లో దీపం వెలిగించడం మంచిదేనా?

18 october 2025

Samatha

దీపావళి పండుగ వచ్చేసింది. 2025 అక్టోబర్ 20 సోమవారం రోజున ప్రతి ఒక్కరూ ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.

ఇక దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ దీపాలను కొనుగోలు చేయడం, టపాసులు, కొత్త బట్టలు కొనుగోలు చేసి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

అయితే  చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. గత సంవత్సరం కొనుగోలు చేసి, వాడిన మట్టి దీపాల్లో మళ్లీ దీపం వెలిగించ వచ్చునా? కాగా దీని గురించి తెలుసుకుందాం.

మట్టి దీపాలను సాధారణంగా ఒకసారి మాత్రమే ఉపయోగించడం శుభప్రదమని చెబుతున్నారు పండితులు. ఎందుకో ఇప్పుడు మనం చూద్దాం.

దీపాలు ప్రతి కూల శక్తిని గ్రహిస్తాయి, అందువలన వాటిని తిరిగి ఉపయోగించడం మంచిది కాదంట. దీపం వెలిగించే ముందు కూడా సంఖ్య, స్థానం గమనించాలి.

ముఖ్యంగా దీపావళి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో విరిగిన లేదా పలిగినటువంటి దీపాలను అస్సలే ఉపయోగించకూడదంట. ఇది అశుభం 

మట్టి దీపాలు తప్ప మరి ఏ ఇతర ఇత్తడి, వెండి, వంటి లోహపు దీపాలను మళ్లీ శుభ్రం చేసి, అగ్నితో తిరిగి శుద్ధి చేసి ఉపయోగించడం వలన ఎలాంటి నష్టం ఉండదంట.

ఇక దీపాలను ఎప్పుడూ, తూర్పు లేదా ఉత్తరం వైపు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద వెలిగిస్తే దాని జ్వాల ఇంటిలోపలి వైపు ఉండాలంట.