రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా.? 

12 August 2025

Prudvi Battula 

పర్వతాలపై పశువులను మేతను తీసుకొని వెళ్ళినప్పుడు వర్షాకాలంలో, చలికాలంలో పొగమంచు ఉన్నందున దారి సరిగా కనిపించదు.

పశువుల కాపరులు తాము తిరిగి వెళ్లే దారి గుర్తుపట్టడానికి రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చడం వల్ల వారు సులభంగా తమ గ్రామానికి తిరిగి రాగలరు.

పర్వతాలలో నివసించే ప్రజలు ప్రకృతిని దేవుడిగా భావించి చిన్నపాటి రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి పూజిస్తూ ఉంటారు.

ఇలా రాళ్ళు పేర్చితే వారి ప్రయాణం సురక్షితంగా సాగుతుందని నమ్ముతారు. ప్రయాణంలో ఎలాంటి అడ్డంకులు రాకుండా దేవుని ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు.

రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి పర్వత ప్రాంతంలో ప్రజలు తమ భక్తిని తెలియజేస్తారు. వీటిని దగ్గరే వారి కోరికలు కూడా చెబుతుంటారు.

కొన్ని ప్రాంతాల్లో రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చడం మరణించినవారికి ప్రతీకగా భావిస్తారు. ఇలా చేస్తే వల్ల ఆత్మలకు శాంతి కాలుతుందని, ప్రయాణంలో అవి రక్షిస్తాయని వారి నమ్మకం.

పర్వతాలలో కొన్ని ప్రాంతాలలో సహజంగా శివలింగం ఆకారంలో ఉండే రాళ్ళను శివునిగా పూజిస్తారు. అదే విధంగా దేవతామూర్తులకు అంకితం చేయబడిన రాళ్ళు ఉన్నాయి.

చాలామంది ఇలా రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి పోగులుగా ఉంచితే ఈశ్వరుడు తమ కోరికను నెరవేరుస్తాడని నమ్ముతారు.