చాణక్య నీతి : డబ్బు లేదని బాధపడకండి.. ఇలా చేస్తే కోటీశ్వరులు మీరే!

12 october 2025

Samatha

ఆ చార్య చాణక్యుడు తత్వవేత్త. అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఈయన నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి తెలియజేశారు.

అదే విధంగా చాలా మంది పేదరికంతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారికి కూడా ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది.

జీవితంలో ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో, వారు ఇక బాధపడాల్సిన పని లేదు, మీరు ధనవంతులు కావాలంటే తప్పక ఈ నియమాలు పాటించాలన్నారు.

మీరు ఈ నియమాలను పాటిస్తే, మీ ఖజానా త్వరగా డబ్బుతో నిండిపోతుందని తెలియజేశారు. కాబట్టి, వాటి గురించి వివరంగా మనం తెలుసుకుందాం.

ధనవంతులు కావాలి అంటే నిజాయితీ తప్పనిసరి, మీరు ఎప్పుడూ న్యాయపరంగా ఉంటూ, నిజాయితీగా డబ్బు సంపాదిస్తే మీరు ధనవంతులు అవుతారంట.

ఆ చార్య చాణక్యుడి ప్రకారం, ఎవరైతే ఎప్పుడూ పనికి రాని వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేస్తారో వారు పేదవారిగా మిగిలిపోతారంట.

అందుకే పనికి రాని వస్తువులపై కాకుండా, మీ దగ్గర ఉండే ఏ కాస్త సంపదనైనా సరే కాస్త తెలివిగా ఖర్చు చేయడం ఉత్తమం అంటున్నారు చాణక్యుడు.

ధనవంతులు అవ్వాలంటే తప్పనిసరిగా ప్రణాళిక చాలా అవసరం. మీరు ఎలా డబ్బు సంపాదిస్తారు. దాని కోసం ఏం చేయాలి అనేది ప్రణాళిక వేసుకోవాలంట.