చాణక్య నీతి : ఎవరి ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందో తెలుసా?

Samatha

14 august  2025

Credit: Instagram

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం ద్వారా నేటి తరం వారికి ఎన్నో విషయాలను తెలియజేయడం జరిగింది.

అయితే చాలా మంది ఎంత సంపాదించినా, ఇంట్లో ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్యలే వస్తుంటాయి. కాగా, అసలు లక్ష్మీ దేవి ఎవరి ఇంటివద్ద ఉండటానికి ఇష్టపడుతుందో చూద్దాం.

చాణక్యుడి ప్రకారం లక్ష్మీ దేవి కొంత మంది దగ్గర ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతుందంట. వారు ఎవరు అంటే?

ఇంట్లో పరిశ్రభత లేని చోట లక్ష్మీదేవి నివసించదు అని చెబుతున్నారు ఆచార్య చాణఖ్యుడు. మురిగా, చెల్లాచెదురుగా వస్తువులు ఉండకూడదంట.

పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, వ్యాధులను ఆహ్వానించడమే కాకుండా, ప్రతి కూల శక్తి కూడా ఉంటుందంట.

చాణక్య నీతి ప్రకారం అందరు కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకునే ఇంటిలో మాత్రమే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుందంట.

ప్రతిరోజూ తగాదాలు, దుర్భాషలు లేదా కోపం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, ఆనందం ఉండదని చెబుతున్నాడు చాణక్యుడు.

ఆచార్య చాణక్యుడు విద్యకు పెద్ద పీఠవేస్తాడు. అతని ప్రకారం, విద్య, జ్ఞానం ఎక్కడుంటుందో, అక్కడ లక్ష్మీ దేవి ఉంటుందంట.

విద్యావంతుడు, తెలివైన వాడు మొత్తం కుటుంబానికి మార్గం చూపించగలడు, అలాంటి వ్యక్తి  వద్ద లక్ష్మీ దేవి ఉంటుందంట.