అందమైన పూల తోటల్లో ఎంజాయ్ చేయాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చాలా మందికి రంగు రంగుల పూల మధ్య ఎంజాయ్ చేయాలని ఉంటుంది.
అయితే భారతదేశంలో అతి సుందరమైన పూల తోటలు ఉన్నాయంట. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్లేసెస్కి వెళ్తే ఆ ఆనందమే వేరే ఉంటుంది అంటున్నారు ప్రకృతి ప్రేమికులు.
ఉత్తరాఖండ్ లోని ఫ్లవర్స్ వ్యాలీ చూటనికి చాలా అద్భుతంగా ఉంటుంది. సుందరమైన పూలతో కప్పబడిన ఆల్ఫైన్ పచ్చిక భూములు చుట్టూ కొండలు చూడటానికి చాలా బాగుంటాయి.
మహారాష్ట్రలోని ఫ్లవర్స్ వ్యాలీ చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఆగస్టునుంచి సెప్టంబర్ వరకు ఈ ప్రదేశం అందమైన పూలతో నిండిపోతుంది. చాలా సుందరంగా మారిపోతుంది.
అంతే కాకుండా ఇక్కడ 850కి పైగా పుష్పజాతులు ఉన్నాయంట. ఇవి చూడటానికి చాలా అందంగా ఉండటమే కాకుండా మనసుకు హాయినిస్తాయి.
పూలతో కూడిన రంగుల ప్రపంచాన్ని చూడాలి అనుకుంటే యమ్ తాంగ్ లోయ ఉత్తర సిక్కింకు వెళ్లాల్సిందే. ఇక్కడ రోడోడెండ్రాన్లతో పాటు ప్రిములాస్, ఐరిసెస్, ఇతర పువ్వులతో రంగుల ప్రపంచాన్ని తలపిస్తుంది.
అందమైన పూలతోటలు,వాగులు, అద్భుతంగా ఉండే కొండలు, పచ్చటి ప్రకృతి మధ్య సువాసనలు వెదజల్లే పూల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకుంటే నాగాలాడ్ అండ్ మణిపూర్ దగ్గరలోని జుకో లోయ బెస్ట్ ప్లేస్.
పర్యాటకులు మెచ్చే అతిసుందరమైన ప్రదేశాల్లో కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మున్నార్ . సుందరమైన కొండ ప్రాంతం. ఇక్కడి అందమైన కొండలు పర్యాటకులకు ఆనందాన్ని ఇస్తాయి.