అసలే వర్షకాలం.. వేడి వేడిగా ఇంట్లో పానీపూరి తింటే ఎన్ని లాభాలో!

samatha 

1 july  2025

Credit: Instagram

పానీపూరీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని మరీ పానీ పూరి తింటుంటారు.

అయితే వర్షకాలంలో ఇంట్లోనే వేడి వేడిగా, కాస్త స్పైసీగా పానీ పూరీ చేసుకొని తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి

పానీపూరీలో ఉండే చింత పండునీరు, పుదీనా, జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌లను పెంచి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుందంట.గ్యాస్, ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అలాగే పానీ పూరీ తినడం వలన ఇది మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. ఇందులో నీరు పుష్కలంగా ఉండటం వలన ఇది హైడ్రేషన్ స్థాయిలను మెరుగుపరస్తుందంట.

పానీ పూరి మిశ్రమంలో ఉండే ఇంగువ,జీర,పుదీనా వంటివి ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, ఫ్రీరాడికల్స్‌తో పోరాడడానికి సహాయపడతాయి,శరీరానికి శక్తినిస్తాయి.

ఇంట్లో తయారు చేసిన పానీ పూరీ చాలా ఆరోగ్యకరమైనది. అలాగే వీటిని కాల్చిన నూనెలో కాకుండా మంచి నూనెలో వేయించడం వలన శరీరానికి ఎలాంటి హనీ జరగదు.

అదే విధంగా ఇంటిలో తయారు చేసుకున్న పానీ పూరీ తినడం వలన ఇది మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని చింతపండు,పుదీనా కడుపు సమస్యలను తొలగిస్తుంది.

ఉడికించిన బంగాళాదుంపలు, మొలకలు, ఉల్లిపాయల వంటి కూరగాయలతో మీరు ఇంటిలోనే పానీపూరి చేసుకొని తినడం వలన మీ శరీరానికి విటమిన్స్ అందుతాయి.