సమ్మర్‌లో పండ్లు తినడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

samatha 

20 April 2025

Credit: Instagram

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది ఎక్కువగా పండ్లు తినడానికి ఇంట్రెస్ట్ చూపరు. ఐస్ క్రీమ్స్, జ్యూస్ లు తాగడానికే ఇష్టపడుతారు.

కానీ వేసవి కాలంలో పండ్లు తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. అవి ఏవో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉండటమే కాకుండా, పోటాషియం, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అందువల్ల దీనిని సమ్మర్ లో తప్పకుండా పండ్లు తినాలంట.

వేసవిలో పండ్లు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతే కాకుండా,పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

అదే విధంగా వేసవిలో పండ్లు తినడం వలన అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపడటమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

సమ్మర్ లో ఎక్కువ నీటి శాతం ఉండే పండ్లను తినడం వలన అవి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. అంతే కాకుండా చర్మం కూడా నిగారింపుగా తయారు అవుతుంది.

పండ్లను సమ్మర్ లో తినడం వలన వీటిలో పొటాషియం అధికంగా ఉండటం వలన గుండె సమస్యల నుంచి కాపాడుతుంది. బీపీ అదుపులో ఉండేలా చేస్తుంది.

అంతే కాకుండా సమ్మర్ లో చాలా మంది అలసటకు గురి అవుతారు. అలాంటి వారు వేసవిలో ప్రతి రోజూ కనీసం ఒక్క పండైనా తినడం వలన శరీరం ఆరోగ్యంగ ఉంటుందంట.