శంఖు పుష్పం ముఖ్యంగా దైవారాధనలో వాడుతూ ఉంటారు. కానీ, శంఖు పుష్పం అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
శంఖుపుష్పాల టీని తరచుగా తీసుకుంటే.. అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ టీని ఎండిన పూలతో తయారు చేస్తారు.
ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు. ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే..
జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి.
శంఖుపువ్వుల టీలో కెఫిన్ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
ఇది జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు, టాక్సిన్స్ను తొలగిస్తాయి, అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఒక హెర్బల్ డ్రింక్.
రోజూ శుంఖు పుష్పాల టీ తాగితే.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి.