మరణించిన 24 గంటల్లో తన ఇంటికి చేరనున్నఆత్మ? ఎందుకో తెలిస్తే మతిపోతుంది! 

samatha 

27 JUN  2025

Credit: Instagram

చావు పుట్టుకలు అనేవి కామన్.గరుడ పురాణంలో మరణానికి సంబంధించిన అనేక విషయాల గురిచి చాలా విషయాలు తెలియజేయడం జరిగింది.

ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆత్మ అనేది యమలోకానికి వెళ్తుంది. కానీ చనిపోయిన 24 గంటల తర్వాత ఆత్మ అనేది తిరిగి తన ఇంటికి చేరుతుందంట.

అసలు యమలోకానికి వెళ్లిన ఆత్మ, మళ్లీ తన ఇంటికి ఎందుకు చేరుతుంది. అసలు దీని గురించి గరుడ పురాణంలో ఏం రాసి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

యమలోకానికి వెళ్లిన తర్వాత 24 గంటల్లో మళ్లీ ఒక వ్యక్తి ఆత్మ తిరిగి భూమికి చేరుతుందంట. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయంట.

మానవ శరీరం నుంచి యమధర్మరాజు ఆత్మను బయటకు లాగినప్పుడు, యముడు ఆ ఆత్మను భూమి నుంచి చాలా దూరంగా తీసుకెళ్తాడంట.

అంతే కాకుండా ఆ వ్యక్తి కర్మల లెక్కలను కూడా ఆయన ఆ సమయంలో పరిష్కరించుకుంటాడంట. అలాగే భూమిపైకి వచ్చిన తర్వాత కూడా యమధర్మరాజు మరోసారి కర్మ లెక్కలను తనిఖీ చేస్తాడంట.

ఈ క్రమంలోనే చనిపోయిన వ్యక్తి ఆత్మ అనేది 24 గంటలు భూమిపై సంచరిస్తుందంట. ఎందుకంటే? ఇది దాని కర్మలను గుర్తు చేస్తుందంట.

అంతే కాకుండా ఈ కర్మఫల లెక్కలు ఆ ఆత్మ తదుపరి జీవితాన్ని సిద్ధం చేయడానికి కూడా ఉపయోగపడుతుందంట. అందుకే ఆత్మ చనిపోయిన 24 గంటల తర్వాత భూమిపై సంచరిస్తుందంట.