రోజుకు ఒక అరటి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

samatha 

13  JUN  2025

Credit: Instagram

అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండు చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటుంటారు.

అయితే ప్రతి రోజూ ఒక అరటి పండు తినాలని చెబుతుంటారు. కాగా రోజూ అరటి పండు తినడం వలన శరీరంలోఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

అరటిపండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన క్రమంత తప్పకుండా వీటిని తింటే ఇది జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అరటి పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది రక్తపోటును నియంత్రిచడంలోనే కాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అరటి పండ్లలో కేలరీ, కొవ్వులు తక్కువమోతాదులో ఉండి ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది మీకు కడుపు నిండిని అనుభూతిని ఇస్తుంది,.బరువు నియంత్రణలో ఉంటుంది.

అరటిపండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి.

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉండటం వలన ఇది కండరాల తిమ్మరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వలన అది మెదడుకు అవసరమైన బీ6 అందించి మానసిక పరిస్థితిని మెరుగు పరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది