వణికిస్తున్న జీబీఎస్ వైరస్.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
samatha
28 January 2025
Credit: Instagram
ఇప్పటికే కరోనా వైరస్తో అనేక ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు మరో ప్రమాదం ముంచుకొస్తుంది.
జీబీఎస్( గుల్లెయిన్ బారే సిండ్రోమ్ ) అనే వైరస్ ప్రస్తుతం మహారాష్ట్రాలో విజృంభిస్తుంది. దీంతో చాలా మంది ఈ వ్యాధి బారినపడుతున్నారు.
దాదాపు 100 మందికి పైగా ఈ వ్యాధి సోకిన వారు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది అంటు వ్యాధి కాదు, కానీ ఇది మానవుని నాడీ వ్యవస్థపై దాడి చేస్తుందని, దీని వలన రోగనిరోధక శక్తి తగ్గిపోతుందంట.
ఈ వ్యాధి సోకిన వారు లక్షణాలను వెంటనే గుర్తించి ఆసుపత్రిలో చేరాలంట. లేకపోతే సరైన చికిత్స అందకపోతే మరణించే ప్రమాదం కూడా ఉంటుందంట.
ఈ వ్యాధి లక్షణాల విషయానికొస్తే.. బలహీనత, తిమ్మిరి వంటి లక్షణాలు ఈ వ్యాధి గ్రస్తులలో కనిపిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అంతే కాకుండా, పాదాలు, చేతి వేళ్లలో జలదరింపులు, అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు లాంటి సమస్యలు తలెత్తుతాయంట.
అలాగే మింగడం లేదా మాట్లాడటం కూడా చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా కొన్ని సార్లు పక్షవాతం వచ్చే ఛాన్స్ ఉంటుందంట.