పంది మాంసం తింటున్నారా.? మెడికల్ బిల్లు‎కు ఆస్తులు అమ్మినా సరిపోవు..

05 August 2025

Prudvi Battula 

పంది మాంసంలో ప్రోటీన్, ఇనుము వంటి పోషకాలు ఉన్నప్పటికీ అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నట్టు నిపుణులు అంటున్నారు.

దశాబ్దాలుగా పంది మాంసం వినియోగం వల్ల చాలా నష్టాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది దీన్ని తింటుంటారు.

పంది మాంసం క్యాన్సర్ కారకం. దీన్ని తింటే వల్ల కొలొరెక్టల్, పెద్దప్రేగు, మల క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

స్త్రీలు దీన్ని రోజుకు 100 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ తీసుకొంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

పంది మాంసంతో ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకు దీన్ని తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పంది మాంసంలో యెర్సినియా అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాణాంతకమని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.

2011లో జరిగిన ఓ అధ్యయనంలో పంది మాంసం రోజు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

2012లో, 100,000 మందికి పైగా చేసిన ఒక అధ్యయనంలో పంది మాంసం తినడం అకాల మరణానికి దారితీయొచ్చని వెల్లడైంది.