చేపలు ఇష్టమని ఎక్కువగా తినేస్తే.. ఆ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్టే..

05 August 2025

Prudvi Battula 

ప్రెగ్నెన్సీ మహిళలు చేపలు తినడం హానికరం. గర్భధారణ సమయంలో చేపలు అధికంగా తినడం వల్ల పిండం, బిడ్డ ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.

చేపలను అధికంగా తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. కొన్ని రకాల చిన్న చేపలల్లో DDE అనే విష మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

వీటిని అతిగా తింటే శరీరంలో పీసీబీ పెరిగి మెదడు లేదా నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

చిన్న చేపలను తిన్నప్పుడు, ఈ పదార్ధం నెమ్మదిగా కాలేయంలో చేరిపోతుంది. దీని కారణంగా ఊబకాయం, మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

మెర్క్యురీ, PCBలు తక్కువగా ఉండే చేపలను ఎంచుకోవాలి. పాదరసం ఉన్న చేపలను ఎక్కువగా తింటే, అది మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం కావచ్చు.

చేపలు ఎక్కువగా తినడం వల్ల డిప్రెషన్ ఏర్పడుతుంది. అలాగే చిరాకుగా అనిపిస్తుంది, జ్ఞాపకశక్తి తగ్గుతుంది.

పాలు తాగిన తర్వాత కూడా చేపలు తినకూడదు. చేపలు, పాలు ఒకేసారి తినడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.

మీకు చేపలు తినడం ఇష్టమైతే, చేపలు తిన్న తర్వాత పాలు తాగకుండా ఉండేలా జాగ్రత్త వహించాలి. వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి.