ఈ పులావ్ ముందు ఏ నాన్ బిర్యానీలు పనికిరావు.. అప్పట్లో ఎగబడే వాళ్లు
Prasanna Yadla
09 september 2026
Pic credit - Pinterest
ఇది వరకు రోజుల్లో మన తాతలు ఇలా చేసుకుని తినే వాళ్ళు అందుకే వాళ్ళు ఇప్పటికి బలంగా ఉన్నారు.
మష్రూమ్ పలావ్
ఒక కప్పు బాస్మతి బియ్యం, 200 గ్రాముల మష్రూమ్స్ , 10 పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 10 పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ఒక దాల్చిన చెక్క , 4 లవంగాలు , రెండు యాలకులు , నాలుగు బిర్యానీ ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి.
కావలసిన పదార్థాలు
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 10 నిమిషాల పాటు వీటిని బాగా నానబెట్టి ఆ తరవాత ఈ నీరు వంపేసి పచ్చిమిర్చి, పుదీనా ఆకులు తీసుకోవాలి.
స్టెప్ 1
అర కట్ట కొత్తిమీరను తీసుకుని దీనిలో నీరు పోసి దానిని మెత్తగా గ్రైండ్ పట్టుకుని పేస్ట్ మాదిరి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2
ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయినా తరవాత
దీనిలో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, రెండు యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దీనిని బాగా వేయించాలి.
స్టెప్ 3
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కనీసం 5 నిమిషాలు పాటు బాగా వేయించాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇంకో 4 నిమిషాలు కలుపుతూ బాగా వేయించాలి. ఇక చివరిగా దీనిలో నానబెట్టిన బియ్యం కూడా వేసి బాగా కలపాలి.
స్టెప్ 4
ఇంకా దీనిలో రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీరు కూడా పోసి బాగా కలపాలి. అన్ని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి. చివర్లో నిమ్మరసం కూడా చల్లి పలావ్ను కలిపి కిందకు దించుకోవడమే.