శనగపిండి పకోడాలు గుడ్ బై.. ఈ సారి పప్పు పకోడాలు ట్రై చేయండి!

Prasanna Yadla

 28 June  2026

Pic credit - Pinterest

మనం ఇప్పటి వరకు శనగపిండి పకోడిలను చేసుకుని తిన్నాము. అయితే, ఈ సారి కొత్తగా టీ టైమ్ స్పెషల్ కొత్త రుచితో ఇలా  చేయండి

 కొత్త రుచితో ఇలా 

మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

తయారీ విధానం

అయితే, దీనిలో శనగపిండికి బదులు  మసూర్ పప్పును వేసుకుంటాము. వీటితో రుచి పెరుగుతుంది 

మసూర్ పప్పు

మీరు ముందుగా మసూర్ పప్పును  తీసుకుని రెండు గంటల పాటు నానబెట్టి, ఆ తరవాత నీటిని వంపేయాలి.

స్టెప్ 1 

ఆ తర్వాత ఈ పప్పును తీసుకుని మిక్సీలో కొద్దిగా నీటితో  దీనిని మంచిగా రుబ్బుకోవాలి.

స్టెప్ 2

 పప్పులో ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీర ఆకులు, కరివేపాకు ఆకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.

స్టెప్ 3

ఇంకా కొద్దిగా బియ్యప్పిండి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు, చిటికెడు పసుపు, కారం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

స్టెప్ 4

పాన్ లో ఆయిల్ చేసి మీడియం మంట పై నుంచి  పకోడాలుగా వేసి నూనెలో కాల్చుకోవడమే. 

స్టెప్ 5