ఉదయాన్నే ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?
Krishna
31 May 2026
ఆరోగ్యవంతులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మామిడి పండును నిరభ్యంతరంగా తినవచ్చు. రోజును ప్రారంభించడానికి పుల్లని పండ్లు మినహా మామిడి వంటి ఏ పండైనా మంచి ఎంపికేనని డైటీషియన్ లవ్లీన్ కౌర్ తెలిపారు.
ఖాళీ కడుపుతో
తీవ్రమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేదా హైపర్గ్లైసీమియా వంటి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మామిడి పండ్లను అస్సలు తినకూడదని ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ముగ్ధా ప్రధాన్ సూచించారు.
వీరు తినకూడదు
మధుమేహం ఉన్నవారు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటే చిన్న పరిమాణంలో ఒకేసారి ఒక పండు తినొచ్చు. గ్లైసెమిక్ లోడ్ను సమతుల్యం చేసుకోవడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలతో కలిపి తీసుకోవాలి.
డయాబెటిస్
ఐ.బి.ఎస్, హైపరాసిడిటీ సమస్యలతో బాధపడేవారు కూడా మామిడి పండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖాళీ కడుపుతో మామిడి పండు తినడం వల్ల వారిలో విరేచనాలు ఎసిడిటీ లక్షణాలు పెరుగుతాయి.
ఐ.బి.ఎస్
మామిడి పండును ఉదయం లేదా పగటిపూట ఆరోగ్యకరమైన స్నాక్గా తీసుకోవచ్చు కానీ భోజనంతో పాటు, రాత్రి పడుకునే ముందు అస్సలు తినకూడదు. దీనివల్ల శరీరంలో గ్లూకోజ్, చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగే ప్రమాదం ఉంది.
అప్పుడు తినొద్దు
జాస్లోక్ హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ శ్రీమతి డెల్నాజ్ చందువాడియా ప్రకారం.. మామిడి పండును రెండు భోజనాల మధ్యలో చిరుతిండిగా లేదా ప్రధాన భోజనానికి ఒకటిరెండు గంటల ముందు తినడం అత్యంత ఉత్తమమైన మార్గం.
ఉత్తమ సమయం ఏది
మార్కెట్లోకి సీజన్ ప్రారంభంలో వచ్చే మామిడి పండ్లను తినకూడదు, ఎందుకంటే వాటిని కెమికల్స్తో కృత్రిమంగా పండించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కల్తీ పండ్లు
ఉదయాన్నే పండ్లు లేదా ఏదైనా ఆహారాన్ని తినేముందు కనీసం ఒక గ్లాసు ఫిల్టర్ చేసిన మంచినీళ్లు లేదా అర నిమ్మకాయ పిండిన గోరువెచ్చని నీళ్లు తాగడం మంచిదని న్యూట్రిషనిస్ట్ ముగ్ధా ప్రధాన్ సలహా ఇచ్చారు.