ముద్ద పప్పుచారు రుచికరంగా ఉండాలి అంటే? ఇలా చేయండి!

Samatha

22 August 2026

ముద్ద పప్పు చారు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరూ లొట్టలేసుకొని మరి తింటారు.

అయితే చాలా వరకు ముద్ద పప్పు చారు ఎలా వండినా చాలా రుచికరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ దీంతో కడుపు నిండుగా తింటారు.

కానీ కొన్ని సార్లు పప్పు చారు ఎంత రుచికరంగా చేసినా టేస్ట్ రాలేదు అనిపిస్తుంది. కాగా ఇప్పుడు మనం పప్పు చారు రుచిగా ఉండాలి అంటే ఏం చేయాలో చూసేద్దాం.

ముద్దపప్పు వండే సమయంలో పప్పు కాస్త ఉడికిన తర్వాత అందులో రోటీలో దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేయాలి.

అంతే కాకుండా పప్పు ఉడకడానికి ముందే కరివేపాకు వేయాలి. ఇందులో లైటుగా మెంతి పొడి కూడా వేసి ఉడక బెట్టుకోవడం వలన రుచి బాగుంటుంది.

ఇక చారు విషయానికి వస్తే, చారు ఎప్పుడూ కూడా పోపు రుచికరంగా ఉండేలా చేసూసుకోవాలి. ఎందుకంటే, చారు బాగుంటే కర్రీ టేస్టీగా ఉంటుంది.

అందువలన చారు కోసం ముందుగా చింత పండు రసం తీసి, అందులో ఎక్కువ మొత్తంలో చిన్ని చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.

తర్వాత కారం, అన్నీ కలపాలి, పోపులో కరివేపాకు ఎక్కువగా వేయాలి. పోపు బాగా కాకుండా కాస్త బాగా వేగిన తర్వాత రసం పోయాలి. ఇలా