రాగులు ఈ కూరగాయలతో కలిపి అస్సలు తినొద్దు.. ఎందుకంటే?

17 December 2024

TV9 Telugu

TV9 Telugu

రాగులతో తయారు చేసిన ఆహారం రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుంది. అందుకే రోజూ ఆహారంలో రాగిపిండిని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు

TV9 Telugu

రాగిలో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ బి-కాంప్లెక్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాగి రోటీలో మంచి కాల్షియం ఉంటుంది

TV9 Telugu

వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలు, గర్భిణులు నిత్యం పాలు తాగుతుంటారు. పాలకన్నా అధికంగా కాల్షియం రాగుల్లో ఉంటుంది

TV9 Telugu

రాగులతో చేసిన ఆహారం తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ మూలకం ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది

TV9 Telugu

ఐరన్‌ అధికంగా ఉన్నందున రక్తహీనత ముప్పు తగ్గుతుంది. రక్తంలో చక్కెరస్థాయిని రాగుల్లో ఉండే పోషకాలు నియంత్రిస్తాయి. దీని వినియోగం రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది

TV9 Telugu

బియ్యం, గోధుమలతో పోలిస్తే రాగుల్లో ‘గ్లైసెమిక్‌ ఇండెక్స్‌’ తక్కువగా ఉన్నందున ఈ ఆహారం తిన్నవారికి ఊబకాయం సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినొచ్చు

TV9 Telugu

వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్లకు రాగి రోటీ తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది. చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి

TV9 Telugu

అయితే సొర, దోసకాయ, పచ్చి టొమాటోతో కలిపి వీటిని రాత్రిపూట తినకూడదు. ఎందుకంటే రాగులు, ఈ కూరగాయలు చల్లని స్వభావం కలిగి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలను కలిగిస్తాయి