ఈమె కౌగిట నలిగిన అందానిది ఏనాటి వరమో.. స్టన్నింగ్ సాయి ధన్షిక..
25 March 2025
Prudvi Battula
Credit: Instagram
20 నవంబర్ 1989 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ నగరమైన తంజావూరులో జన్మించింది వయ్యారి భామ సాయి ధన్షిక.
ఎక్కువగా తమిళంలో నటిస్తుంది ఈ వయ్యారి భామ. 2006లో తమిళ చిత్రం మనతోడు మజాయికాలంతో చలనచిత్ర అరంగేట్రం చేసింది.
అదే ఏడాది మరంతన్ మీమరంతన్, తిరుడి చిత్రాల్లో కనిపించింది. ఈ మూడు చిత్రాల్లో మరీనా అనే పేరుతో గుర్తింపు పొందింది.
2009లో కెంపా అనే కన్నడా యాక్షన్ డ్రామా సినిమాతో శాండల్ వుడ్ ప్రేక్షకులను పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.
కబాలి సినిమాలో రజినీకాంత్ కూతురు పాత్రతో తెలుగులో కూడా పేరు తెచ్చుకుంది. 2017లో సోలో సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన కథానాయకిగా తొలిసారి మలయాళీ సినిమాలో కనిపించింది.
2019లో ఉద్ఘర్ష అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కథానాయకిగా రెండోసరి కన్నడ చిత్రం చేసింది. తర్వాత కన్నడలో కనిపించలేదు.
2022లో కామెడీ ఎంటర్టైనర్ చిత్రం షికారులో ముఖ్య పాత్రలో నటించింది ఈ బ్యూటీ. ఇది ఈమెకు తొలి తెలుగు సినిమా.
2024లో అంతిమ తీర్పు, దక్షిణ అనే రెండు తెలుగు సినిమాల్లో నటించింది. అదే ఏడాది ఐందం వేదం అనే జీ5 వెబ్సిరీస్తో ఆకట్టుకుంది.