ప్రస్తుతం తెలుగు హీరోయిన్స్ వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఈ ముద్దుగుమ్మలు బాలీవుడ్లో కూడా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు.
అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం టాలీవుడ్ బ్యూటీస్ రేంజ్ పెరిగిందనే చెప్పాలి, పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు.
కాగా, చాలా మందిలో ఓ డౌట్ ఉంటుంది. అసలు వీరి రెమ్యునరేషన్ ఎంత? ఏ హీరోయిన్ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని.దాని గురించే తెలుసుకుందాం.
రష్మికమందన్న నటించిన పుష్ప, యానిమల్ మూవీస్తో ఈ బ్యూటీకి పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెరిగింది. అయితే ఈ నటి ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందంట.
యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ డౌన్ ఫాల్ అయినా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటుంది. ఈ నటి ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుంది.
హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్న బ్యూటీ సాయిపల్లవి ఈ నటి ఒక్కో సినిమాకు 1.5 కోట్లు తీసుకోగా, తండేల్ మూవీ కోసం రూ. 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
అదేవిధంగా అటు బాలీవుడ్లో తెరకెక్కుతోన్న రామాయణం మూవీ కోసం ఏకంగా రూ. 5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.