తమిళ్ ఇండస్ట్రీనే నమ్ముకున్న  బేబమ్మ.. కృతిశెట్టికి క్యూ కడుతున్న ఆఫర్స్..

05 october 2025

Rajeev 

కృతి శెట్టి  తెలుగు, తమిళ సినిమాల్లో పని చేస్తూ బిజీగా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ 2003 సెప్టెంబరు 21న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది

 ఆమె తండ్రి కృష్ణ శెట్టి వ్యాపారవేత్త, తల్లి నీతి శెట్టి ఫ్యాషన్ డిజైనర్. చిన్నతనం కృతి శెట్టి పలు బ్రాండ్‌ల వాణిజ్య ప్రకటనల్లో నటించింది. 

ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. కృతి 2019లో హిందీ చిత్రం సూపర్ 30లో నటించింది. 

కృతిశెట్టికి 2021లో వచ్చిన తెలుగు చిత్రం ఉప్పెనతో గుర్తింపు లభించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. 

ఈ సినిమాలో కృతిశెట్టి నటనకు ప్రశంసలు అందాయి. ఆ తర్వాత ఆమె శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోల్లో తన అందంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

దీంతో తెలుగులో కృతిశెట్టికి అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ చిన్నది తమిళ సినిమాలపై దృష్టి సారించింది