14 June, 2025
Subhash
ఇక 3 వేల రూపాయల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలు చేస్తే ఛార్జీలు ఉంటాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూపీఐ లావాదేవీలపై ఎటువంటి మొత్తానికి ఎలాంటి ఛార్జీలు ఉండవని జూన్ 11న ఆర్ధిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఇటువంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది.
0.3 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ని మళ్లీ అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే రూ.3000 కంటే ఎక్కువ చెల్లింపుల వరకు రూ.9 వరకు ఛార్జీ విధించవచ్చు.
2022 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎండీఆర్ని తొలగించింది. దీని తర్వాత యూపీఐ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు వ్యవస్థగా మారింది.
ఇప్పుడు మొబైల్ నంబర్, యూపీఐ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే చెల్లింపు సాధ్యమవుతుంది. బ్యాంకు వివరాలు లేదా ఐఎఫ్సీఐ కోడ్ అవసరం లేదు. ఇది చెల్లింపును సులభతరం చేసింది.
యూపీఐని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వంటి ఇతర చెల్లింపు వ్యవస్థలు ఆర్బీఐ కిందకు వస్తాయి.
మే 2025లో యూపీఐ ద్వారా రూ.25.14 లక్షల కోట్ల విలువైన 18.67 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఒక నెలలో లావాదేవీల సంఖ్య 4 శాతం పెరుగుదల ఉంది.
ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాలలో యూపీఐ ప్రారంభమైంది. రష్యా సింగపూర్, యూఏఈ వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.