మార్కెట్లో కరెన్సీ..రూ.2 వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ సంచలన ప్రకటన

03 June, 2025

Subhash

రూ.2వేల నోట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) సోమవారం కీలక ప్రకటన చేసింది. వెనక్కి తీసుకున్న రూ.2వేల నోట్ల ఇంకా పూర్తిస్థాయిలో రిజర్వ్‌ బ్యాంక్‌కు చేరలేదని పేర్కొంది. 

రూ.2వేల నోట్లపై

ప్రస్తుతం రూ.6,181 కోట్ల విలువైన నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 2016 నవంబర్ 8న 2వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది.

ప్రజల వద్దే 

బ్లాక్ మనీ, అవినీతి, నకిలీ కరెన్సీకి బ్రేకులు వేసేందుకు కేంద్ర నోట్లను రద్దు చేసింది. నోట్ల రద్దుతో వచ్చే కరెన్సీని కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం రూ.2 వేల నోట్లను తీసుకువచ్చింది.

బ్లాక్ మనీ

మహాత్మా గాంధీ సిరీస్ నోట్లలో భాగంగా అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో నోట్లను విడుదల చేసింది రిజర్వ్‌ బ్యాంక్‌.

మహాత్మా గాంధీ సిరీస్

ఇతర డినామినేషన్‌‌ల కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం రూ.2వేల నోట్లను 19 మే 2023న చెలామణి నుంచి ఉపసంహరించుకుంది ఆర్బీఐ.

డినామినేషన్‌

వెనక్కి తీసుకున్న సమయంలో చెలామణిలో రూ.3.56లక్షల విలువ రూ.2వేల నోట్లు ఉన్నాయి. ఆ తర్వాత రూ.2000 నోట్లు మార్చుకునేందుకు ఆర్‌బీఐ అవకాశం కల్పించింది.

చెలామణి

ఈ రెండు వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే అవకాశం 2023 అక్టోబర్ 7 వరకు అవకాశంఇచ్చింది.

బ్యాంకుల్లో

ఆర్‌బీఐ ఆఫీసుల్లో ఈ నోట్లను మార్చుకుని తమ అకౌంట్లల్లో డిపాజిట్ చేసుకునే అవకాశం ఇప్పటికీ అవకాశం ఉందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.

ఆర్‌బీఐ

దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయాల్లో ఈ సదుపాయం ఉంది. ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లను రూ.2వేల నోట్లను పోస్టాఫీసుల్లోనూ మార్చుకోవచ్చని వెల్లడించింది.

దేశవ్యాప్తంగా