06 May, 2025
Subhash
వివిధ రకాల పోస్టాఫీస్ పథకాల్లో చేరే ప్రక్రియను భారత తపాలా శాఖ మరింత సులభతరం చేసింది.
మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లాంటి ఖాతాలను డిజిటల్ పద్ధతిలో తెరిచే సదుపాయాన్ని తీసుకొచ్చింది.
కేవలం ఆధార్ బయోమెట్రిక్ ద్వారా ఆయా ఖాతాలు సులువుగా తెరిచే వెసులుబాటును కల్పించింది. పేపర్ వర్క్ అవసరాన్ని పూర్తిగా తప్పించింది.
పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా తెరవడానికి తపాలాశాఖ ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్ బేస్డ్ ఈ-కేవైసీ విధానాన్ని అనుసరిస్తోంది.
ఏప్రిల్ 24 నుంచి దీన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS), టైమ్ డిపాజిట్ (TD), కిసాన్ వికాస్ పత్ర (KVP), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) లాంటి పాపులర్ పథకాలకు విస్తరించింది.
ఈ మేరకు తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. పోస్టాఫీస్ కార్యాలయాల్లో ఆయా ఖాతాలన్నీ ఆధార్ ఈకేవైసీ సాయంతో సులువుగా తెరవవచ్చని పేర్కొన్నది.
పూర్తిగా డిజిటల్ విధానంలో ఖాతా తెరువనున్నారు. అయితే కొత్తపద్ధతితోపాటు పాత పద్ధతిని కూడా అందుబాటులో ఉంచనున్నారు.
తర్వాత పేరు, స్కీమ్ టైప్, డిపాజిట్ మొత్తం లాంటి వివరాలు నమోదు చేస్తారు. వివరాలన్నీ ధ్రువీకరించుకున్నాక తుది సబ్మిషన్ కోసం మరోసారి ఖాతాదారు నుంచి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు.