07 June, 2025
Subhash
కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూ.2 వేల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నోట్లు కూడా వంద శాతం బ్యాంకులకు తిరిగి రాలేదని ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది.
ఈ 2 వేల రూపాయల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు 19 మే 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఇక త్వరలో దేశంలో రూ.500 నోట్లను (Rs 500 Currency Notes) కూడా ప్రభుత్వం రద్దు చేయనుందంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
2026 మార్చి నాటికి రూ.500 నోట్లను ఆర్బీఐ చెలామణి నుంచి ఉపసంహరించుకుంటుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
సోషల్ మీడియాలో దీనిపై వీడియోలు వైరల్ అవుతున్నాయి. 2026 మార్చి నాటికి రూ.500 నోట్లు చాలామణీలో లేకుండా పోతాయని వైరల్ అవుతోంది.
12 నిమిషాల నిడివిగల ఓ యూట్యూబ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారంపై ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) తాజాగా స్పందించింది.
ప్రభుత్వం 500 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవటం లేదు. అవి చలామణీలోనే ఉంటాయి. వైరల్ అవుతున్న వీడియోలు అబద్దమని స్పష్టం చేసింది.
ఈ నోట్లు దేశవ్యాప్తంగా చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయి. వాటి జారీ, స్వీకరణ యథావిధిగా కొనసాగుతుందని అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.