మోడీ సర్కార్ మాస్టర్‌ ప్లాన్‌.. కొత్త గోల్డ్ స్కీమ్‌.. ఇక వారికి పండగే

July 4, 2026

Subhash

భారతీయుల ఇళ్లలో వేల టన్నుల బంగారం అల్మారాల్లో, లాకర్లలో ఉపయోగం లేకుండా ఉంది. బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే ఆస్తిగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఆర్థిక వ్యవస్థ

ఇప్పుడు కేంద్రం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే రెండు వారాల్లో ఈ స్కీమ్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం.

గోల్డ్ మానిటైజేషన్

ప్రస్తుతం దేశంలో సుమారు 25 వేల టన్నుల బంగారం ప్రజల వద్ద ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.

25 వేల టన్నుల బంగారం

ఇందులో కేవలం 5 శాతం బంగారాన్ని స్కీమ్ కింద తీసుకురాగలిగితే 1,250 టన్నుల వరకు బంగారం వ్యవస్థలోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని విలువ దాదాపు రూ.8లక్షల కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. 

బంగారం స్కీమ్

2015లో ప్రారంభించిన పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌లో ప్రధానంగా బ్యాంకుల ద్వారానే బంగారం డిపాజిట్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు కేంద్రం కొత్త స్కీమ్‌ను అమలు చేయనుంది.

కొత్త స్కీమ్‌

విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న బంగారు నగల వ్యాపారులను కూడా కలెక్షన్ పార్ట్‌నర్‌గా చేర్చే ప్రతిపాదనలో ఉంది. అంటే ప్రజలు గుర్తింపు పొందిన జ్యువెలరీ షాపులోనే బంగారాన్ని డిపాజిట్ చేయొచ్చు.

కొత్త విధానం

ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న బంగారం అలాగే ఉంచితే ఎలాంటి ఆదాయం రాదు. కానీ ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే బంగారంపై వడ్డీ లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. 

బంగారం

అలాగే అవసరమైనప్పుడు నిబంధనల ప్రకారం బంగారం లేదా దానికి సమానమైన డబ్బు పొందే అవకాశం కూడా ఉండవచ్చు. అంటే ఉపయోగంలో లేని ఆస్తి ఆదాయం ఇచ్చే పెట్టుబడిగా మారనుందన్నమాట.

అవసరమైనప్పుడు