దంచికొడుతున్న ఎండలు.. 45°C దాటిన ఉష్ణోగ్రతలు, వడగాల్పుల హెచ్చరిక!

Prasanna Yadla

23 April 2026

Pic credit - Pixabay

రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

రాష్ట్రంలో ఎండ తీవ్రత

గురువారం 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా..

అలాగే 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. రేపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలులు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

రికార్డు ఉష్ణోగ్రతలు 

శుక్రవారం రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఎల్లుండి 07 తీవ్ర, 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.

వడగాలులు ప్రభావం

ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, కొత్తూరు, లక్ష్మీనర్సుపేట, మందస, నందిగాం, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు

శ్రీకాకుళం జిల్లా

బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, లక్కవరపుకోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రాపురం, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, శృంగవరపుకోట, తెర్లాం, వంగర, వేపాడ, విజయనగరం రూరల్ మండలాలు

విజయనగరం 

ఎండలో బయటకు వెళ్లేటప్పుడు టోపిలాంటివి ధరించాలి.  చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త ఉండాలి

 బయటకు వెళ్లేటప్పుడు  జాగ్రత్త 

 కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు తిరగకండి

 సన్ గ్లాసెస్