23 March 2025
Subhash
మార్కెట్లో మారుతి సుజుకి కార్లకు ప్రత్యేక స్థానముంది. సామాన్యుడి నుంచి ఉన్నత వర్గాల వారు సైతం మారుతి సుజుకీ వాహనాలను వాడుతుంటారు.
ఇప్పటికే చాలా సార్లు అప్డేట్ అవుతూ కొత్తగా వచ్చిన మారుతీ సుజుకీ ఆల్టో త్వరలో మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్తో ఆకట్టుకునే డిజైన్తో అడగుపెట్టడానికి సిద్ధమైంది
48-వోల్ట్ సూపర్ ఎనర్జీ ఛార్జింగ్ సిస్టమ్ను దీనిలో అందించవచ్చు. దీంతో మైలేజ్ మరింత ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం మైలేజ్ కార్లకు డిమాండ్ ఉన్న కారణంగా దీనిని తయారు చేయనుంది.
అయితే ఇలా బరువు తగ్గించడం వలన మైలేజ్ కూడా ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. ఇంజిన్పై ఒత్తిడి తగ్గినట్లయితే రోడ్డుపై ఇది సాఫీగా ప్రయాణిస్తుంది.
కొత్త తరం ఆల్టోలో ఇప్పటి వరకు చూడని విధంగా శక్తివంతమైన హైబ్రిడ్ టెక్నాలజీని కూడా అందిస్తున్నారని తెలుస్తుంది. దీంతో ఇది ఫెర్ఫామెన్స్ విషయంలో అదిరిపోయేలా ఉండనుంది.
48-వోల్ట్ సూపర్ ఎనర్జీ ఛార్జింగ్ సిస్టమ్తో రానుంది. దీంతో మైలేజ్ మరింత ఎక్కువగా వస్తుంది. ప్రస్తుతం మైలేజ్ కార్లకు డిమాండ్ ఉన్న కారణంగా దీనిని తయారు చేయనుంది.
రాబోయే కొత్త తరం మారుతీ సుజుకీ ఆల్టో లీటరుకు దాదాపు 30 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ మైలేజ్ ఇస్తుందని తెలుస్తుంది.
ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హ్యాచ్బ్యాక్ కార్లు చాలా వరకు 20 కి.మీలకు పైనే మైలేజ్ను ఇస్తున్నాయి. ఈ క్రమంలో మరింత ఎక్కువ మైలేజ్ అందించినట్లయితే కస్టమర్లకు బాగా చేరువ అవుతుంది.
ఈ కొత్త తరం ఆల్టో మొదట జపాన్లో 2026 లో విడుదల కానుంది. ఆ తరువాత భారత్లో లాంచ్పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.