ఈ ఆలయ ప్రాంగణం ఆత్మలకు నిలయం.. చిన్న తప్పు చేసిన సమస్యల ఉంబిలొకి.. 

22 June 2025

Prudvi Battula 

మెహందీపూర్ బాలాజీ దేవాలయం రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో ఉన్న ఒక హిందూ దేవాలయం. జైపూర్ నుండి 103 కిలోమీటర్ల దూరంలో జైపూర్-ఆగ్రా హైవేపై ఉంది.

నిజానికి ఈ ఆలయం హనుమంతునిది. అయితే ఇక్కడ ఆయనను బాలాజీ అని పిలుస్తారు. ఇది ఒక అసాధారణమైన పుణ్యక్షేత్రం.

మెహందీపూర్ బాలాజీ పుణ్యక్షేత్రం దుష్టశక్తుల బారిన పడిన వ్యక్తిని నయం చేసే అద్భుత శక్తులతో ప్రసాదించబడిందని నమ్ముతారు.

ఈ ఆలయానికి దైవిక శక్తి ఉంది. అది శారీరక నొప్పిని నయం చేయగలదు. చేతబడి లేదా ఆత్మల ప్రభావంతో ప్రజలను నయం చేయగలదు.

ఇక్కడ పూజించబడుతున్న విగ్రహం స్వయంగా ప్రత్యక్షమైందని నమ్ముతారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు.

ఇక్కడ గంటల శబ్దం ప్రతిధ్వనించదు కానీ ఆత్మలు, దయ్యాలు అరుపులు వినిపిస్తాయి. ఇక్కడ ప్రసాదం కూడా ఇవ్వరు.

ఇక్కడి స్థానికులు కూడా పర్యాటకులకు ఇక్కడ ఏది తినవద్దని, ఆహార పదార్థాలు, నీటిని తీసుకోవద్దని చెబుతుంటారు.

ఆలయం లోపల ఎవరితోనైనా మాట్లాడటం లేదా తాకడం నిషేధించబడింది. ఎందుకంటే వ్యక్తికి వ్యాధి సోకవచ్చు లేదా దయ్యాలు ప్రభావం చూపవచ్చు.

ఆలయాన్ని దర్శించిన తర్వాత మీరు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదని నమ్ముతార. ఎందుకంటే దుష్టాత్మ మిమ్మల్ని పట్టుకోవచ్చు.

ఇక్కడ కనిపించే దృశ్యాలు, ధ్వనులు మిమ్మల్ని చాలా కాలం పాటు వెంటాడే అవకాశం ఉన్నందున ఈ ఆలయనికి బలహీన హృదయులు వెళ్ళకండి.