భారత్లో ఈ దేవాలయాలు మానవ నిర్మిత అద్భుతాలు..
08 June 2025
Prudvi Battula
కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నుండి 350 km దూరంలో ఉంది విరూపాక్ష టెంపుల్. ఇది హంపి వద్ద నిర్మాణ సమూహాలలో ఒక భాగం. ఇది యునెస్కోచే ఎంపిక కాబడింది.
మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయాలు వాటి అందాలకు ప్రపంచ ప్రసిద్ధి. ఈ దేవాలయాలు 900 సా.శ నుంచి 1130 సా.శ మధ్య నిర్మించబడ్డాయి.
తమిళనాడులోని షోర్లో అనేక దేవాలయాలు ఉన్నాయి. 8వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దేవాలయ సమూహం నుంచి మీరు బంగాళాఖాతాన్ని సులభంగా చూడవచ్చు.
తమిళనాడులోని మదురైలో మీనాక్షి అమ్మవారి రంగురంగుల దేవాలయం దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తుంటారు.
కేదార్నాథ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయాలలోని అందమైన పర్వతాలను చూడటం ఒక భిన్నమైన అనుభూతిని పొందుతుంది.
తమిళనాడులోని తంజావూర్లో ఉన్న బ్రిహదేశ్వర టెంపుల్ అత్యంత అందమైన ఆలయాల్లో ఒకటి. ఇది నిర్మాణశైలి అద్భుతం.
ఢిల్లీలోని అక్షరధామ్ స్వామినారాయణ ఒక హిందూ దేవాలయం. ఈ ఆధ్యాత్మిక-సాంస్కృతిక ప్రాంగణం ఆధునిక నిర్మాణం.
జనవరి 2024న ప్రతిష్టించిన మరో ఆధునిక అద్భుత దేవాలయం అయోధ్య బాల రామ మందిరం. ఈ టెంపుల్ చాల అందంగా నిర్మించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
శాతవాహన రీజియన్ టూర్.. తెలంగాణ టూరిజం నయా ప్యాకేజీ..
ఐస్క్రీమ్తో అనేక ప్రయోజనాలు.. తెలిస్తే షాక్..
సండే టూర్ ఉందా.? ఈ శైవక్షేత్రం మంచి ఎంపిక..