దీపావళి పూజలో జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే.. అరిష్టం..

15 October 2025

Prudvi Battula 

Images: Pinterest

దీపావళి.. అందరి మనసుల్లో కాంతులు నింపే పండగ. ఈ రోజున దీపాల వెలుగులతో ఊరులో ఇళ్లన్నీ వెలిగిపోతుంటాయి.

దీపావళి 

అలాంటి దీపావళి పండక్కి చేసే పూజలో కొన్ని తప్పులు చెయ్యడం అరిష్టమని పండితులు భావన. ఈ పూజను నిష్ఠగా చెయ్యడం ముఖ్యం.

దీపావళి పూజ 

నలుపు రంగు దుస్తులు ధరించడం లేదా నలుపు రంగుతో దీపావళి బహుమతులు ప్యాక్ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఇది దురదృష్టానికి కారణం అవుతుంది.

నల్లని వస్తువులు

విగ్రహాలను సరైన దిశలో ఉంచాలి. పూజ స్థలంలో కూర్చున్న స్థితిలో లేని లేదా కుడి వైపు తొండం ఉన్న గణేశుడి విగ్రహాన్ని ఉంచకూడదు.

విగ్రహల దిశ

లక్ష్మీపూజ చేస్తున్నప్పుడు లేదా దాని తర్వాత వెంటనే క్రాకర్లు వెలిగించకూడదు. ఇది నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుంది.

క్రాకర్లు

లక్ష్మీదేవికి ఆర్తి పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టడం మానుకోవాలి. బదులుగా చిన్న గంటను ఉపయోగించవచ్చు.

లక్ష్మీదేవికి ఆర్తి

పూజ తర్వాత కలశంలోని నీటిని బయటకు పోయకుండా, కుండీలలోని మొక్కలకు పోయాలి. ఇది మంచి మంచి ఫలితాన్ని ఇస్తుంది.

కలశం నీళ్లు

సంప్రదాయం ప్రకారం, దీపావళి రాత్రి లక్ష్మీదేవిని స్వాగతించడానికి మేల్కొని ఉండాలి. చాలామంది నిద్రపోతారు.

లక్ష్మి ఆహ్వానం