మానసికంగా ప్రశాంతంగా గడిపితే కొన్ని కోట్ల సంపద ఉన్నట్లే. ఈరోజుల్లో చాలా మంది బిజీ బిజీగా గడుపుతున్నారు. ఉదయం లేచిందంటే ఉరుకుల పరుగులతో కాలాన్ని వెల్లదీస్తున్నారు.
దీంతో మానసిక ప్రశాంతతే కరువై అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఆనందంగా ఉండాలన్నా, ఒత్తిడి నుంచి బయటపడాలి అనుకుంటే తప్పకుండా యోగా చేయాలంట.
యోగా అనేది మనసుకు ప్రశాంతతను, మంచి ఏకాగ్రతను ఇస్తుంది.కాగా, మానసిక ప్రశాంతతను పెంచుకోవడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తడసన (పర్వత భంగిమ) : కొన్ని యోగాసనాలు వేయడం వలన మెదడు పనితీరు మెరుగు పడటమే కాకుండా అది మానసిక స్థితిపై మంచి ప్రభావం చూపిస్తుంది.
అయితే మానసికంగా ప్రశాంతతను ఇచ్చే ఆసనాల్లో తడసనం ఒకటి. దీనిని ఎలా వేయాలంటే? నిటారుగా నిలబడి, రెండు చేతులుపైకి లేపి నమస్కరిస్తూ ఉండాలి. శరీరాన్ని పూర్తిగా పైకి వంచాలి.
వృక్షాసన (వృక్ష భంగిమ) :మెదడు, కండరాల బలోపేతానికి అద్భుతమైన ఆసనం వృక్షాసనం. దీనిని రెండు పాదాలపై నిలబడి, తర్వాత మరోకాలిని మోకాలిపై వరకు పెట్టాలి. ఒంటి కాలిపై నిలబడి నమస్కారం చేయాలి.
పద్మాసనం : ఈ ఆసనం ధాన్య భంగిమలా ఉంటుంది. దీనిని వేయడం వలన మనసుకు ప్రశాంతత కలగడమే కాకుండా, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందంట.
బాలసనం : బాలాసనం నాడీ వ్యవస్థ సక్రమంగా సాగేలా చేస్తుంది. దీనిని ఎలా వేయాలంటే? మోకాల్లపై వంగి, తలను నేలకు ఆనించి, రెండు అరచేతులను నేలపై ఉంచాలి.
త్రతక ఆసనం దీనిని చికటి ప్రదేశంలో ఒక చోట కొవ్వత్తిని వెలిగించి కొద్ది దూరంలో కొర్చొని వెలిగే మంటనే చూడాలి. తర్వాత కళ్లు మూసుకొని దానిని ఊహించుకోవాలి.