19 May 2025
Pic credit: Pexels
TV9 Telugu
భారతీయ ఇళ్లలో, పాలు, పెరుగు, వెన్న మన దినచర్య ఆహారంలో ముఖ్యమైన భాగం. దీనికి కారణం పాలు.. దాని నుండి తయారయ్యే అన్ని ఉత్పత్తులే. పాలలో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి.
పాలు ఆరోగ్యానికి ఒక వరం లాంటివిగా భావిస్తారు. పూర్వకాలంలో పాలలో నీరు మాత్రమే కలిపేవారు. కానీ నేడు పాలలో నీటితో పాటు అనేక రకాల రసాయన పదార్ధాలను కలుపుతున్నారు. దీంతో పాలు కూడా ఆరోగ్యానికి హానికరంగా మారాయి.
పాల కేంద్రం నుంచి ఆవు లేదా గేదె పాలను మీరే స్వయంగా తెచ్చుకోవడానికి పొందడానికి ప్రయత్నించండి. లేదా ఇంట్లో జంతువులను కూడా పెంచవచ్చు. అయితే మార్కెట్ నుంచి తెచ్చుకునే పాలలో కల్తీని గుర్తించడం ఎలా అంటే..
పాలల్లో స్టార్చ్ ని కలిపారో లేదో తెసుకోవడానికి.. వాటిని మరిగించి చల్లార్చండి. తరువాత కొద్దిగా పాలు తీసుకుని..అయోడిన్ ద్రావణం కలపండి. అప్పుడు పాలు నీలం రంగులో కనిపిస్తాయి. అయితే ఈ పాలను వేడి చేస్తే నీలి రంగు మాయమై.. చల్లారిన తర్వత మళ్ళీ కనిపిస్తుంది.
చాలా మంది పాలను డిటర్జెంట్తో కల్తీ చేస్తారు. దీనిని గుర్తించడానికి.. పాలలో సమాన పరిమాణంలో నీరు కలిపి బాగా కదిలించండి. అప్పుడు నురుగు ఏర్పడితే పాలు డిటర్జెంట్ కల్తీ అయి ఉండవచ్చు.
పాల చిక్కదనం కోసం పాలల్లో కొవ్వు కలుపుతారు. పాలను తక్కువ మంట మీద మరిగించండి. పాలు చల్లబడిన తర్వాత చిక్కగా కొవ్వు కనిపిస్తుంది. వాసన చూసినా.. ఆ మీగడతో వెన్న తీసి నెయ్యి కాచినా వాసన డిఫరెంట్ గా వస్తుంది.
మార్కెట్లో సింథటిక్ పాలకు కొరత లేదు, రసాయనాల సహాయంతో పాలను తయారు చేస్తారు. పాలను తియ్యగా చేయడానికి గ్లూకోజ్ కలుపుతారు. దీనిని తనిఖీ చేయడానికి, డయాసెంట్రిక్ స్ట్రిప్ను పాలలో ఒక నిమిషం ముంచండి. కల్తీ ఉంటే పాల రంగు మారుతుంది.
కృత్రిమ పాలను చిక్కగా చేయడానికి పాలల్లో పొడి కలుపుతారు. దీన్ని తెలుసుకోవడానికి సులభమైన మార్గం ఏమిటంటే.. పాలు చిక్కబడే వరకూ మరిగించండి. ఇది పిండి కలిపిన పాలను సులభంగా గుర్తించడంలో సహాయపడుతుంది.