ఇలా తోడు పెడితే.. తక్కువ టైంలోనే.. గడ్డలాంటి పెరుగు..
Prudvi Battula
01 September 2025
పెరుగు త్వరగా తోడుకోవాలంటే..ప్లేట్లో కొన్ని గోరు వెచ్చని నీళ్లు పోసి అందులో తోడు వేసిన పాల గిన్నె పెడితే టేస్టీ పెరుగు తక్కువ టైంలోనే రెడీ అవుతుంది.
పెరుగు త్వరగా తోడుకోవాలంటే తోడు వేసిన గిన్నెను మరొక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. ఇలా చేస్తే త్వరగా తోడుకుంటుంది.
తోడు పెట్టే గిన్నె అడుగున పెరుగు వేశాక పాలు పోయాలి. తర్వాత ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముంచాలి. ఇలా చేస్తే రెండుమూడు గంటల్లోనే చిక్కటి పెరుగు తోడుకుంటుంది.
ఎండుమిర్చి తుంచి వేసినా త్వరగా తోడుకుంటుంది. ఎండుమిర్చి వల్ల పెరుగు పులుపు రాదు. చాల టేస్టీగా కూడా ఉంటుంది.
పాలలో తోడు పెట్టాక కవ్వంతో కాసేపు చిలికితే పెరుగు త్వరగా తోడుకుంటుంది. ఇలా చేస్తే గడ్డలా కూడా మారుతుంది.
ఒక గిన్నె తీసుకుని అందులో రెండు చెంచాల పెరుగు వేసి బాగా మిక్స్ చేయండి. దీని తరువాత పాలలో పుల్లని పెరుగును కలపండి.
ఇప్పుడు దానిని కదలిని చోట ఓ గుడ్డతో కప్పి ఉంచండి. నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. మీరు ఉదయం లేవగానే మార్కెట్ లభించే గడ్డకట్టిన పెరుగు రెడీ అవుతుంది
పెరుగును తోడు పెట్టె ముందు, పాలు చాలా వేడిగా ఉండకూడదని గుర్తుంచుకోండి. పెరుగును గోరువెచ్చని పాలలో మాత్రమే ఉంచండి