దేశంలో అత్యధిక బంగారం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా?

TV9 Telugu

17 January 2025

ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టుబడి, పొదుపు కోసం బంగారాన్ని విరివిగా కొనుగోలు చేస్తున్నారు.

బంగారం గురించి చెప్పాలంటే, బంగారంతో చేసిన ఆభరణాలకు భారతదేశంలో నివసిస్తున్న మహిళలు మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా బంగారం నిల్వ ఉందో మీకు తెలుసా.? దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

భారతదేశంలో బంగారం ఉత్పత్తి గురించి మాట్లాడితే, అందులో 80% కర్ణాటక రాష్ట్రంలోనే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.

దేశంలో అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే రాష్ట్రం కర్ణాటక. ఇక్కడి హుట్టి గోల్డ్ మైన్స్ నుంచి ఎక్కువ బంగారాన్ని తీస్తారు.

ముడి ఖనిజం పరంగా చెప్పాలంటే భారతదేశంలోని మొత్తం బంగారు వనరులలో 44% బీహార్‌ రాష్ట్రంలో ఉందని నివేదిక.

భారతదేశంలోని బంగారు వనరులలో రాజస్థాన్‌ రాష్ట్రంలో 25%, కర్ణాటక రాష్ట్రంలో 15% బంగారు వనరులు ఉన్నాయి.

దాదాపుగా దేశం మొత్తం బంగారం అంత ఈ రాష్ట్రాల నుంచి ఉత్పత్తి అవుతుంది. మరి కొన్ని రాష్ట్రాల్లో వనరులు ఉన్న వీటిలోని అధికం.