కడుపు ఉబ్బరం వేధిస్తోందా.? ఈ ఫుడ్స్ ట్రై చేయండి..
TV9 Telugu
09 March 2025
తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల కడుపుబ్బడరం సమస్య వేధిస్తోంది. అయితే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.
దోసకాయలు కడుపు సంబంధిత సమస్యలకు చెక్ పెట్టడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు జీర్ణ శక్తిని మెరుగ్గా చేస్తుంది.
జీర్ణ వ్యవస్థకు మేలు చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.
అరటి పండులోని పొటాషియం కడుపు ఉబ్బరం సమస్యను దూరం చేస్తుంది. రోజూ రాత్రి ఒక అరటి పండు తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.
మంచి ప్రోబయాటిక్కు పెరుగు పెట్టింది పేరు. ఇందులోని మంచి బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది కడుపుబ్బరంను దూరం చేస్తుంది.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ కూడా కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఉదయం టిఫిన్గా ఓట్స్ను తీసుకుంటే మేలు జరుగుతుంది.
జీవక్రియలను మెరుగుపరచడంలో గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఎన్నో సద్గుణాలు కడుపు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
కడుపుబ్బరాన్ని తగ్గించడంలో సిట్రస్ పండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి పండ్లు తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
విరాట్ ధరించే వాచ్ ధర ఎంత?
అతిపెద్ద సునామీ.. 12 దేశాల్లో భారీ ప్రాణ నష్టం.. లిస్టులో ఇండియా కూడా!
ధనుష్కోడికి కాళరాత్రి మారిన ఆ నైట్.. తలచుకొంటేనే వెన్నులో వణుకు..