ముందుగా పచ్చిమిర్చీ తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి, తొడిమలు కట్ చేసి, మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి.
పచ్చి మిర్చీ, మటన్
ఇప్పుడు, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె పోసి, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు లవంగాలు, వేసి మంచిగా వేయించుకోవాలి.
స్టవ్ ఆన్
తర్వాత ఇందులోకి మటన్ వేసి బాగా వేగనివ్వాలి. మటన్ కాస్త ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి మిర్చి ఉల్లి పేస్ట్ వేయాలి. కొన్ని నీళ్లు పోసి ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి.
మటన్ ఉడకబెట్టడం
మటన్ ఉడికిన తర్వాత ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, పూదీన, కొత్తిమీర వేయాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి కారం మటన్ రెడీ.