రోజూ ఇవి గుప్పెడు తింటే.. ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం
22 September 2025
Ravi Kiran
బరువు తగ్గాలనుకునేవారికి పల్లీలు బెస్ట్ ఆప్షన్. వీటిల్లో ఆరోగ్యకరమైన ఫ్యట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఈ ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు.. ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
షుగర్ పేషెంట్స్ ఈ పల్లీలు తినడం చాలా ప్రయోజకరం. ముఖ్యంగా ఉడికించిన పల్లీలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి.
పల్లీల్లో ఉండే నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఒలేయిక్ యాసిడ్, రెస్వరాట్రల్ వంటి కంటెంట్ గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
పల్లీల్లో ఉండే ట్రిప్టోఫాన్.. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మానసిక సమస్యలు, డిప్రెషన్ లాంటివి తగ్గడంలో సహాయపదతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.
పల్లీల్లో ఉండే మాంగనీస్, భాస్వరంలు ఎముకుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని అరికడతాయి.
కళ్ల ఆరోగ్యాన్ని కాపాడటంలో పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే జింక్ రేచీకటి సమస్య దూరమవుతుంది
పైన పేర్కొన్న విషయాలను కేవలం ప్రాధమిక సమాచారంతో ఇచ్చినవి మాత్రమే. మీరు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలన్నా ముందుగా వైద్యులను సంప్రదించండి.