కుండ Vs ఫ్రిజ్‌.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?

16 April 2026

TV9 Telugu

TV9 Telugu

బయట మండే ఎండల్లో తిరిగి ఇంటికి రాగానే చాలా మంది చేసే మొదటి పని ఫ్రిజ్ తెరవడం. వెంటనే అందుటలోని బాటిల్‌ అందుకుని చల్లని నీళ్లను తాగకుండా ఉండలేరు

TV9 Telugu

కానీ ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అందిస్తుంది. వాస్తవానికి వేసవిలో ఫ్రిజ్‌ నీళ్లు తాగడం వల్ల శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారు మాత్రం వేసవికాలంలో మట్టి కుండలో నీటిని చల్లబరచి తాగుతారు. మట్టి కుండలోని నీరు సహజంగా చల్లగా ఉండటమే కాకుండా ఖరీదైన ప్యూరిఫైయర్‌లు కూడా అందించలేని కొన్ని ఆరోగ్య గుణాలను కూడా కలిగి ఉంటుంది

TV9 Telugu

రిఫ్రిజిరేటర్‌లోని అతి చల్లని నీరు శరీర జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. అదే మట్టి కుండలోని నీరు సహజంగా క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని ఆమ్ల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది

TV9 Telugu

మట్టి కుండలోని నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎసిడిటీ, కడుపు అసౌకర్యం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీర్ఘకాలిక కడుపు సమస్యలతో బాధపడేవారికి మట్టి కుండ నీళ్లు అమృతం లాంటిది. మట్టి కుండలో నీటిని ఉంచడం వల్ల మట్టిలోని ఖనిజ గుణాలు నీటితో కలుస్తాయి

TV9 Telugu

ఇది సహజ వడపోతలా పనిచేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను తొలగించడానికి మట్టి కుండలోని నీరు చాలా అనువైనది. శరీరం లోపలి నుంచి శుభ్రమైనప్పుడు చర్మం మరింత ప్రకాశవంతంగా, కాంతివంతంగా మారుతుంది

TV9 Telugu

ఫ్రిజ్ లోని చల్లటి నీరు తాగడం వల్ల గొంతులోని రక్తనాళాలు అకస్మాత్తుగా సంకోచిస్తాయి. దీనివల్లే గొంతు నొప్పి, టాన్సిల్స్ వాపు, జలుబు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయి. కానీ మట్టి కుండలోని నీటి ఉష్ణోగ్రత శరీరానికి పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది

TV9 Telugu

మట్టి కుండను వాడితే సరిపోదు, దానికి సరైన సంరక్షణ కూడా అవసరం. కనీసం ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి కుండను క్షుణ్ణంగా శుభ్రం చేసుకోవాలి. నీటిని ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. కుండపై నేరుగా సూర్యరశ్మి పడే ప్రదేశంలో ఉంచవద్దు